బెంగళూరుకు మకాం మార్చిన హార్దిక్ పాండ్యా!
- ట్రైనింగ్ కోసం బెంగుళూరు తరలివెళ్లిన హార్దిక్ పాండ్యా
- కెరీర్ ముగిసే వరకు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో శిక్షణ
- ముంబైలో రాకపోకల ఇబ్బందుల కారణంగా ఈ నిర్ణయం
- ఇలా పూర్తిస్థాయి శిక్షణ కోసం మకాం మార్చిన తొలి భారత క్రికెటర్ గా పాండ్యా
- ప్రస్తుతం తొడ కండరాల గాయం నుంచి కోలుకుంటున్న పాండ్యా
32 ఏళ్ల హార్దిక్, బెంగుళూరు శివార్లలో సీఓఈకి సమీపంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. ముంబైలోని తన ఇంటి నుంచి ప్రతిరోజూ శిక్షణకు ప్రయాణించడం కష్టంగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్ కావడంతో అతనికి సీఓఈలోని అత్యాధునిక సౌకర్యాలు, గాయాల నిర్వహణ, నైపుణ్య శిక్షణ వంటివి అందుబాటులో ఉంటాయి. అక్కడ తన సొంత ఫిజియోథెరపిస్ట్, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్తో పాటు, సొంత ఖర్చులతో నెట్ బౌలర్లను కూడా ఏర్పాటు చేసుకుంటున్నాడు.
గత ఆరు నెలలుగా తొడ కండరాల గాయం (క్వాడ్రిసెప్స్ ఇంజ్యూరీ) నుంచి కోలుకోవడానికి హార్దిక్ పాండ్యా సీఓఈలోనే ఎక్కువ సమయం గడిపాడు. ఈ గాయం కారణంగానే ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లండ్ పర్యటనకు కూడా దూరమయ్యాడు. రాబోయే 5-6 ఏళ్ల పాటు భారత్ తరఫున వైట్-బాల్ క్రికెట్ ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హార్దిక్ పాండ్యా తెలిపాడు. త్వరలో జరగనున్న జింబాబ్వే టీ20 సిరీస్కు అందుబాటులో ఉంటాడో లేదో ఇంకా స్పష్టత రాలేదు.