స్వామి వారి చిత్రపటాలు చెత్తకుప్పల్లో పడేశారు: భూమన కరుణాకర్ రెడ్డి
- అలిపిరి వద్ద వేలాది స్వామి ఫొటోలు మలమూత్రాల్లో వేశారన్న భూమన
- చంద్రబాబు దీనికి బాధ్యత వహించాలని డిమాండ్
- విజిలెన్స్ పూర్తిగా నిద్రపోయిందని విమర్శ
టీటీడీని ప్రక్షాళన చేస్తున్నామని రెండేళ్లుగా చెబుతున్నారని... కానీ వాస్తం ఏమిటో కళ్లకు కట్టినట్టు కనిపిస్తోందని భూమన తెలిపారు. సనాతన ధర్మం గురించి మాట్లాడూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఒకసారి ఇక్కడకు వచ్చి చూడాలని అన్నారు. ఇదేనా మీరు చేస్తున్న ప్రక్షాళన అని ప్రశ్నించారు. ఈ అపచారాలకు చంద్రబాబు బాధ్యత వహించాలని అన్నారు. పాలకులు, టీటీడీ అధికారులు సిగ్గు పడాలని వ్యాఖ్యానించారు.