విద్యుత్ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

Good news for electricity employees from the Telangana government
  • తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు 1.62 శాతం డీఏ పెంపు
  • రాష్ట్రవ్యాప్తంగా 70,804 మంది సిబ్బందికి ప్రయోజనం
  • ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రంగ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారి కరువు భత్యాన్ని (డీఏ) 1.62 శాతం పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70,804 మంది ఉద్యోగులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరనుంది. ఈ మేరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క వివరాలను వెల్లడించారు.

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం నమోదవుతున్నప్పటికీ, ఎక్కడా అంతరాయం కలగకుండా నిరంతర సరఫరా కోసం శ్రమిస్తున్న ఉద్యోగుల పనితీరును ప్రభుత్వం గుర్తించిందని భట్టి విక్రమార్క తెలిపారు. టీజీ ట్రాన్స్‌కో, టీజీ జెన్‌కో టీఎస్‌ఎన్‌పీడీసీఎల్ వంటి అన్ని విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ డీఏ పెంపు వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి ఈ నిర్ణయమే నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు.

2035 నాటికి రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ రెట్టింపు అయ్యే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో, ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని పెంపొందించడం అత్యవసరమని ప్రభుత్వం భావిస్తోంది. విద్యుత్ సంస్థల సిబ్బందికి కాలానుగుణంగా డీఏ సవరించడం సాధారణ ప్రక్రియలో భాగమేనని అధికారులు వెల్లడించారు.
Advertisement
Telangana Government
Electricity Employees
Mallu Bhatti Vikramarka
DA Hike
TG Transco Genco
Telangana Power Sector

More Telugu News