ఎబోలా ముప్పు: భారత్లో లేదు.. కానీ నిఘా తీవ్రం!
- బెంగళూరు అనుమానిత వ్యక్తికి నెగెటివ్
- విమానాశ్రయాల వద్ద ముమ్మరంగా స్క్రీనింగ్
- ఆఫ్రికాలో వేగంగా పెరుగుతున్న బుండిబుగ్యో కేసులు
- కాంగోలో వందలాది అనుమానిత మరణాలు
- నిఘా పెంచినట్లు తెలిపిన కేంద్ర ఆరోగ్యశాఖ
ఆఫ్రికా దేశాల్లో వేగంగా విస్తరిస్తున్న ఎబోలా వైరస్ మహమ్మారిపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదని స్పష్టం చేసింది. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో నిఘాను తీవ్రం చేసింది. విమానాశ్రయాలు, సరిహద్దుల్లో తనిఖీలను పటిష్ఠం చేసింది. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని కేంద్ర ఆరోగ్య శాఖ భరోసా ఇచ్చింది.
బెంగళూరులో అనుమానిత కేసు నెగెటివ్
ఇటీవల ఉగాండా నుంచి కర్ణాటకకు వచ్చిన ఓ వ్యక్తికి ఒళ్లు నొప్పులు రావడంతో అధికారులు ముందస్తు జాగ్రత్తగా బెంగళూరులో ఐసోలేషన్లో ఉంచారు. ఆ వ్యక్తి నుంచి సేకరించిన నమూనాలను పూణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. ఆ పరీక్షల్లో అతనికి ఎబోలా నెగెటివ్ అని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆఫ్రికా నుంచి వచ్చారనే కారణంతోనే ఈ ముందస్తు పరీక్షలు నిర్వహించినట్లు వైద్యులు స్పష్టం చేశారు.
విమానాశ్రయాల్లో గట్టి నిఘా
ప్రస్తుత గ్లోబల్ హెల్త్ ప్యాటర్న్స్ను గమనిస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం అన్ని రకాల పబ్లిక్ హెల్త్ ప్రొటోకాల్స్ను అమలు చేస్తోంది. దేశంలోకి వైరస్ ప్రవేశించకుండా ఎంట్రీ పాయింట్లు, అంతర్జాతీయ విమానాశ్రయాల వద్ద నిరంతర స్క్రీనింగ్ ప్రక్రియను కొనసాగిస్తోంది. వైరస్ ముందస్తు గుర్తింపు కోసం దేశవ్యాప్త రెస్పాన్స్ మెకానిజంను మరింత బలోపేతం చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఆఫ్రికాలో విస్తరణ
మరోవైపు ఆఫ్రికా ఖండంలో బుండిబుగ్యో ఎబోలా వేరియంట్ తీవ్రత భయాందోళనలు కలిగిస్తోంది. కాంగోలో ఇప్పటివరకు 101 అధికారిక కేసులు, 10 మరణాలు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేత టెడ్రోస్ అధానోమ్ తెలిపారు. అయితే క్షేత్రస్థాయిలో మరో 900కి పైగా అనుమానిత కేసులు, 220 మరణాలు పరిశీలనలో ఉన్నాయని, వైరస్ ఉద్ధృతి అంచనాలకు మించి ఉందని హెచ్చరించారు. పొరుగు దేశమైన ఉగాండాలోనూ ఇద్దరు వైద్య సిబ్బందితో కలిసి మొత్తం ఏడు కేసులు నమోదయ్యాయి.
బెంగళూరులో అనుమానిత కేసు నెగెటివ్
ఇటీవల ఉగాండా నుంచి కర్ణాటకకు వచ్చిన ఓ వ్యక్తికి ఒళ్లు నొప్పులు రావడంతో అధికారులు ముందస్తు జాగ్రత్తగా బెంగళూరులో ఐసోలేషన్లో ఉంచారు. ఆ వ్యక్తి నుంచి సేకరించిన నమూనాలను పూణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. ఆ పరీక్షల్లో అతనికి ఎబోలా నెగెటివ్ అని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆఫ్రికా నుంచి వచ్చారనే కారణంతోనే ఈ ముందస్తు పరీక్షలు నిర్వహించినట్లు వైద్యులు స్పష్టం చేశారు.
విమానాశ్రయాల్లో గట్టి నిఘా
ప్రస్తుత గ్లోబల్ హెల్త్ ప్యాటర్న్స్ను గమనిస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం అన్ని రకాల పబ్లిక్ హెల్త్ ప్రొటోకాల్స్ను అమలు చేస్తోంది. దేశంలోకి వైరస్ ప్రవేశించకుండా ఎంట్రీ పాయింట్లు, అంతర్జాతీయ విమానాశ్రయాల వద్ద నిరంతర స్క్రీనింగ్ ప్రక్రియను కొనసాగిస్తోంది. వైరస్ ముందస్తు గుర్తింపు కోసం దేశవ్యాప్త రెస్పాన్స్ మెకానిజంను మరింత బలోపేతం చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఆఫ్రికాలో విస్తరణ
మరోవైపు ఆఫ్రికా ఖండంలో బుండిబుగ్యో ఎబోలా వేరియంట్ తీవ్రత భయాందోళనలు కలిగిస్తోంది. కాంగోలో ఇప్పటివరకు 101 అధికారిక కేసులు, 10 మరణాలు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేత టెడ్రోస్ అధానోమ్ తెలిపారు. అయితే క్షేత్రస్థాయిలో మరో 900కి పైగా అనుమానిత కేసులు, 220 మరణాలు పరిశీలనలో ఉన్నాయని, వైరస్ ఉద్ధృతి అంచనాలకు మించి ఉందని హెచ్చరించారు. పొరుగు దేశమైన ఉగాండాలోనూ ఇద్దరు వైద్య సిబ్బందితో కలిసి మొత్తం ఏడు కేసులు నమోదయ్యాయి.