మాపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం.. ఐరాసలో పాక్‌పై భారత్ ఫైర్

Harish Parvathaneni India Warns Pakistan at UN over Terror Attacks
  • ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాకిస్థాన్‌పై భారత్ ధ్వ‌జం
  • సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే తీవ్ర పర్యవసానాలు ఉంటాయ‌ని హెచ్చరిక‌
  • తమపై జరిగే దాడుల నుంచి తమను తాము రక్షించుకునే హక్కు ఉందని స్ప‌ష్టీక‌ర‌ణ‌
  • కశ్మీర్, సింధు జలాల అంశాన్ని పాక్ ప్రస్తావించడంతో గట్టిగా బదులిచ్చిన భారత్ 
  • పాకిస్థాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం మానుకోవాలని డిమాండ్
 ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్‌సీ) వేదికగా పాకిస్థాన్‌పై భారత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత వంటి సూత్రాలను పాకిస్థాన్ యథేచ్ఛగా ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. తమపై జరిగే ఉగ్రదాడుల నుంచి తమను తాము రక్షించుకునే పూర్తి హక్కు తమకుందని, పాకిస్థాన్ చర్యలకు తగిన పర్యవసానాలు ఉంటాయని గట్టిగా హెచ్చరించింది.

చైనా అధ్యక్షతన జరిగిన యూఎన్‌ఎస్‌సీ బహిరంగ చర్చలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి హరీశ్ పర్వతనేని మాట్లాడుతూ.. పాకిస్థాన్ చేసిన ఆధారరహిత ఆరోపణలను తిప్పికొట్టారు. "స్వతంత్ర భారతదేశం ఏర్పడిన నాటి నుంచే, సరిహద్దు ఆక్రమణలతో పోరాడుతోంది. చట్టబద్ధంగా, తిరిగి మార్చలేని విధంగా భారత్‌లో విలీనమైన భూభాగాలను ఆక్రమించుకోవడానికి పాకిస్థాన్ ప్రయత్నిస్తూనే ఉంది" అని ఆయన చారిత్రక వాస్తవాలను గుర్తు చేశారు.

"'భారత్‌ను వెయ్యి గాయాలతో రక్తమోడించాలనే' పాకిస్థాన్ సిద్ధాంతం, వారి డొల్ల మాటలను బట్టబయలు చేస్తోంది. సరిహద్దు ఉగ్రవాదం నుంచి మమ్మల్ని మేము రక్షించుకునే పూర్తి హక్కు భారత్‌కు ఉంది. దీనికి పాకిస్థాన్ తగిన పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది" అని పర్వతనేని స్పష్టం చేశారు. ఉగ్రవాదం, మత ఛాందసవాదం, హింసాత్మక రాడికలిజం వంటి దుష్టశక్తులను పాకిస్థాన్ నిరంతరం ప్రోత్సహిస్తోందని, ఇకనైనా ఉగ్రవాదానికి అన్ని విధాలుగా మద్దతును శాశ్వతంగా నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.

అంతకుముందు ఇదే చర్చలో పాకిస్థాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మాట్లాడుతూ జమ్మూ కశ్మీర్ అంశాన్ని, సింధు జలాల ఒప్పందాన్ని ప్రస్తావించారు. దీనికి భారత్ బలంగా బదులిచ్చింది. 2025 ఏప్రిల్ లో పహల్గామ్‌లో 26 మంది పౌరుల మరణానికి కారణమైన ఉగ్రదాడి తర్వాతే భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిందని గుర్తుంచుకోవాలి. ఈ దాడికి తామే బాధ్యులమని పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తొయిబా (LeT) అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్‌) ప్రకటించుకున్న విషయం తెలిసిందే.
Go Back to Shorts
Harish Parvathaneni
India Pakistan UNSC
UNSC
terrorism
Jammu Kashmir
Line of Control
cross border terrorism
Lashkar-e-Taiba
The Resistance Front
Sindh waters treaty

More Telugu News