'కాంతార' దైవ రూపాన్ని కించపరిచిన కేసు.. హైకోర్టు ఆదేశాలతో చాముండేశ్వరి ఆలయంలో రణ్వీర్ ప్రాయశ్చిత్తం!
- ‘ఐఎఫ్ఎఫ్ఐ 2025’లో రణ్వీర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం
- దైవ నృత్యాన్ని దయ్యాలుగా సంబోధించని రణ్వీర్ సింగ్
- బెంగళూరులో రణ్వీర్ సింగ్ పై ఎఫ్ఐఆర్
- మైసూరు చాముండేశ్వరి దేవికి క్షమాపణలు చెబుతానని హైకోర్టుకు తెలిపిన రణ్వీర్
- అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ప్రాయశ్చిత్తం చేసుకున్న వైనం
బ్లాక్బస్టర్ చిత్రం ‘కాంతార’లోని పవిత్రమైన దైవ రూపాన్ని మిమిక్రీ చేసి వివాదంలో చిక్కుకున్న బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్.. కర్ణాటక హైకోర్టుకు ఇచ్చిన హామీ మేరకు మైసూర్లోని ప్రముఖ చాముండేశ్వరి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని దైవానికి క్షమాపణలు చెప్పుకున్నారు.
గోవాలో జరిగిన ‘ఐఎఫ్ఎఫ్ఐ 2025’ ముగింపు వేడుకల్లో ‘కాంతార’ దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి కూడా హాజరయ్యారు. అయితే రిషబ్ ఆ చిత్రంలో ప్రదర్శించిన అత్యంత పవిత్రమైన ‘దైవ నృత్యం’ (భూత కోల) ను రణ్వీర్ సింగ్ స్టేజ్ పైన కాస్త అతిగా అనుకరిస్తూ మిమిక్రీ చేశారు. దానికి తోడు, తుళునాడు ప్రజలు ఎంతో పవిత్రంగా కొలిచే ఆ ‘దైవాలను’ రణ్వీర్ ‘దయ్యాలు’గా సంబోధించారు. దీంతో, కన్నడ సంస్కృతిని, ఆచారాలను రణ్వీర్ తీవ్రంగా అవమానించారంటూ సామాజిక మాధ్యమాల్లో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమైంది.