ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు... గిన్నిస్ రికార్డు ఖాయం: పల్లా
- ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు
- గిన్నిస్ రికార్డుపై టీడీపీ గురి
- హైబ్రిడ్ విధానంలో 1875 క్లస్టర్లలో నిర్వహణ
- మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఈసారి మహానాడు
- మొత్తం 20 తీర్మానాలపై 65 మంది ప్రసంగాలు
ఈసారి తెలుగుదేశం పార్టీ నిర్వహించబోయే మహానాడు గిన్నిస్ రికార్డు సృష్టించనుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని తొలిసారిగా హైబ్రిడ్ విధానంలో ఏకంగా 1,875 క్లస్టర్లలో నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. మహిళామణులకు అన్ని రంగాల్లో ప్రాధాన్యం కల్పించాలనే ప్రధాన లక్ష్యంతో ఈ మహానాడు జరగనుందని పల్లా స్పష్టం చేశారు.
క్షేత్రస్థాయిలో భవిష్యత్ నాయకులను గుర్తించి, వారిని ప్రోత్సహించడానికే ఈ క్లస్టర్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఇప్పటికే 1,875 క్లస్టర్లకు గానూ 1,851 క్లస్టర్లలో మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయినట్లు తెలిపారు.
మహానాడు తొలిరోజు కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. తొలుత ఎన్టీఆర్కు నివాళులు అర్పించి, తెలుగుతల్లి గీతాలాపనతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మొదటి సెషన్ గంటన్నర పాటు జరిగాక 15 నిమిషాల విరామం, మరో గంటన్నర రెండో సెషన్ తర్వాత భోజన విరామం ఉంటుందని చెప్పారు. ఈ మహానాడులో మొత్తం 20 తీర్మానాలపై 65 మంది వక్తలు ప్రసంగించనున్నట్లు పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.
క్షేత్రస్థాయిలో భవిష్యత్ నాయకులను గుర్తించి, వారిని ప్రోత్సహించడానికే ఈ క్లస్టర్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఇప్పటికే 1,875 క్లస్టర్లకు గానూ 1,851 క్లస్టర్లలో మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయినట్లు తెలిపారు.
మహానాడు తొలిరోజు కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. తొలుత ఎన్టీఆర్కు నివాళులు అర్పించి, తెలుగుతల్లి గీతాలాపనతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మొదటి సెషన్ గంటన్నర పాటు జరిగాక 15 నిమిషాల విరామం, మరో గంటన్నర రెండో సెషన్ తర్వాత భోజన విరామం ఉంటుందని చెప్పారు. ఈ మహానాడులో మొత్తం 20 తీర్మానాలపై 65 మంది వక్తలు ప్రసంగించనున్నట్లు పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.