రైతులకు తీపి కబురు చెప్పిన తమిళనాడు సీఎం విజయ్
- తమిళనాడులో రైతులకు పంట రుణాల మాఫీ పథకాన్ని ప్రకటించిన ప్రభుత్వం
- సహకార బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతులకు ఈ పథకం వర్తింపు
- సన్నకారు రైతులకు రూ.50,000 వరకు పూర్తి రుణమాఫీ
- చిన్న, పెద్ద రైతులకు రుణ పరిమాణాన్ని బట్టి పాక్షికంగా మాఫీ
- రైతుల ఆర్థిక భారాన్ని తగ్గించడమే లక్ష్యమని తెలిపిన అధికారులు
తమిళనాడులోని లక్షలాది మంది రైతులకు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. సహకార బ్యాంకుల ద్వారా పంట రుణాలు తీసుకున్న సన్నకారు, చిన్న రైతులకు వర్తించేలా కీలక రుణమాఫీ పథకాన్ని సోమవారం ప్రకటించింది. వ్యవసాయ రుణాలతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
సోమవారం చెన్నైలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ మంత్రి ఎం. వినోద్, సహకార శాఖ మంత్రి వి. గాంధీరాజ్, ఆర్థిక మంత్రి ఎన్. మరియా విల్సన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఎవరికి ఎంత మాఫీ?
ప్రభుత్వం ప్రకటించిన ఈ పథకం కింద, వివిధ కేటగిరీల రైతులకు రుణ పరిమాణాన్ని బట్టి మాఫీ వర్తిస్తుంది.
సన్నకారు రైతులు: రూ.50,000 వరకు తీసుకున్న పంట రుణాలు పూర్తిగా మాఫీ అవుతాయి. రూ.50,001 నుంచి రూ.1 లక్ష వరకు ఉన్న రుణాలకు రూ.5,000 నుంచి రూ.40,000 వరకు పాక్షిక మాఫీ లభిస్తుంది.
చిన్న రైతులు: రూ.50,000 వరకు తీసుకున్న రుణాలపై 50 శాతం మాఫీ వర్తిస్తుంది. రూ.50,001 నుంచి రూ.1 లక్ష వరకు ఉన్న రుణాలకు రూ.5,000 నుంచి రూ.20,000 వరకు ఉపశమనం కల్పించారు.
పెద్ద రైతులు: సహకార బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్న అర్హులైన పెద్ద రైతులకు ఈ పథకం కింద రూ.5,000 మాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
ఈ రుణమాఫీ పథకం ద్వారా రాష్ట్రంలోని రైతులపై ఆర్థిక భారం గణనీయంగా తగ్గుతుందని, వ్యవసాయ రంగానికి ఇది ఎంతో చేయూతనిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
సోమవారం చెన్నైలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ మంత్రి ఎం. వినోద్, సహకార శాఖ మంత్రి వి. గాంధీరాజ్, ఆర్థిక మంత్రి ఎన్. మరియా విల్సన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఎవరికి ఎంత మాఫీ?
ప్రభుత్వం ప్రకటించిన ఈ పథకం కింద, వివిధ కేటగిరీల రైతులకు రుణ పరిమాణాన్ని బట్టి మాఫీ వర్తిస్తుంది.
సన్నకారు రైతులు: రూ.50,000 వరకు తీసుకున్న పంట రుణాలు పూర్తిగా మాఫీ అవుతాయి. రూ.50,001 నుంచి రూ.1 లక్ష వరకు ఉన్న రుణాలకు రూ.5,000 నుంచి రూ.40,000 వరకు పాక్షిక మాఫీ లభిస్తుంది.
చిన్న రైతులు: రూ.50,000 వరకు తీసుకున్న రుణాలపై 50 శాతం మాఫీ వర్తిస్తుంది. రూ.50,001 నుంచి రూ.1 లక్ష వరకు ఉన్న రుణాలకు రూ.5,000 నుంచి రూ.20,000 వరకు ఉపశమనం కల్పించారు.
పెద్ద రైతులు: సహకార బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్న అర్హులైన పెద్ద రైతులకు ఈ పథకం కింద రూ.5,000 మాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
ఈ రుణమాఫీ పథకం ద్వారా రాష్ట్రంలోని రైతులపై ఆర్థిక భారం గణనీయంగా తగ్గుతుందని, వ్యవసాయ రంగానికి ఇది ఎంతో చేయూతనిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.