ట్రంప్కు ముంబైలోని ఇరాన్ ఎంబసీ వీడియోతో కౌంటర్
- ట్రంప్ ఒకసారి భారత్ వచ్చి చూడాలని సూచన
- భారతదేశంలో అభివృద్ధి, సాంస్కృతిక విలువలు ట్రంప్కు తెలిసేలా వీడియో
- మహారాష్ట్రలోని భవనాలు, సుందర ప్రదేశాలను షేర్ చేసిన ఎంబసీ
చైనా, భారతదేశాలను నరకంతో పోలుస్తూ రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్ చేసిన వ్యాఖ్యల లేఖను రీపోస్ట్ చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ముంబైలోని ఇరాన్ ఎంబసీ స్పందించింది. ట్రంప్ ఒకసారి భారత్ వచ్చి చూడాలని ఆ తర్వాత ఈ దేశం గురించి మాట్లాడాలని వ్యాఖ్యానించింది. ఈ మేరకు 'ఎక్స్' వేదికగా ఒక వీడియోను పోస్టు చేసింది.
భారతదేశంలోని అభివృద్ధి, సాంస్కృతిక విలువలు ట్రంప్నకు తెలిసేలా ఎవరైనా ఆయనను భారతదేశ పర్యటనకు తీసుకువస్తే బాగుండేదని పోస్టులో పేర్కొంది. ఈ వీడియోలో మహారాష్ట్రలోని అత్యాధునిక సదుపాయాలు, సంప్రదాయ వేడుకలు, పర్యాటక ప్రదేశాలకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది.
మహారాష్ట్రలోని అత్యంత ఎత్తైన భవంతులు, ఆధునిక రహదారులు, వినాయక నిమజ్జనంను ఈ వీడియోలో పొందుపరిచింది. ఇంకోవైపు, కొండలు, కోనలు, వాగులు, వంకలతో అద్భుతమైన సుందర ప్రదేశాలు ఉన్నాయని పేర్కొంది.
భారతదేశంలోని అభివృద్ధి, సాంస్కృతిక విలువలు ట్రంప్నకు తెలిసేలా ఎవరైనా ఆయనను భారతదేశ పర్యటనకు తీసుకువస్తే బాగుండేదని పోస్టులో పేర్కొంది. ఈ వీడియోలో మహారాష్ట్రలోని అత్యాధునిక సదుపాయాలు, సంప్రదాయ వేడుకలు, పర్యాటక ప్రదేశాలకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది.
మహారాష్ట్రలోని అత్యంత ఎత్తైన భవంతులు, ఆధునిక రహదారులు, వినాయక నిమజ్జనంను ఈ వీడియోలో పొందుపరిచింది. ఇంకోవైపు, కొండలు, కోనలు, వాగులు, వంకలతో అద్భుతమైన సుందర ప్రదేశాలు ఉన్నాయని పేర్కొంది.