ఏపీ లిక్కర్ స్కాం... విచారణకు హాజరు కావాలని రాజ్ కెసిరెడ్డికి హైకోర్టు ఆదేశం

AP Liquor Scam Raj kasi Reddy Ordered to Attend SIT Investigation
  • ఏపీ మద్యం స్కాంలో ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డికి హైకోర్టు ఆదేశం
  • ఈ నెల 24న సిట్ దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలని ఉత్తర్వు
  • ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం
  • పిటిషన్‌పై తదుపరి విచారణను కూడా ఏప్రిల్ 24వ తేదీకి వాయిదా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కెసిరెడ్డి, ఈ నెల 24న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారి ఎదుట విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

మద్యం స్కాం కేసులో విచారణకు రావాలంటూ సిట్ అధికారులు ఇటీవల రాజ్ కెసిరెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో అరెస్టు నుంచి రక్షణ కోరుతూ ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం ఈ పిటిషన్‌పై జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ధర్మాసనం విచారణ చేపట్టింది.

సిట్ జారీ చేసిన నోటీసులను అనుసరించి దర్యాప్తునకు హాజరుకావాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఏప్రిల్ 24న విచారణ అధికారి ముందు హాజరు కావాలని రాజ్ కెసిరెడ్డిని ఆదేశించింది. ఇదే సమయంలో, ఆయన బెయిల్ పిటిషన్‌పై తదుపరి విచారణను కూడా ఏప్రిల్ 24వ తేదీకి వాయిదా వేసింది. దీంతో దర్యాప్తు సంస్థ ముందు హాజరయ్యే రోజే ఆయన బెయిల్ భవితవ్యంపై కూడా స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.
Go Back to Shorts
Raj kasi Reddy
AP Liquor Scam
Andhra Pradesh Liquor Case
Liquor Investigation
SIT Investigation
High Court Order
Advance Bail Petition
Liquor Mafia
AP News
Crime News

More Telugu News