బంగ్లా క్రికెట్లో కొత్త శకం: భారత్తో సత్సంబంధాల కోసం తమీమ్ ప్రయత్నాలు
బంగ్లాదేశ్లో రాజకీయ మార్పులతో పాటు ఆ దేశ క్రికెట్ బోర్డులోనూ పెను మార్పులు సంభవించాయి. కొత్త ప్రధానమంత్రిగా తారిఖ్ రెహమాన్ బాధ్యతలు చేపట్టాక, క్రికెట్ కార్యకలాపాలను చక్కదిద్దే బాధ్యతను మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్కు అప్పగించారు.
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులో నెలకొన్న అస్థిరతను తొలగించేందుకు 11 మంది సభ్యులతో కూడిన అడ్-హాక్ కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి అధ్యక్షుడిగా తమీమ్ ఇక్బాల్ బాధ్యతలు చేపట్టారు. రాబోయే 90 రోజుల్లోగా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించి బోర్డును గాడిలో పెట్టాలని కొత్త యాజమాన్యం నిర్ణయించింది.
టీ20 వరల్డ్ కప్ 2026 సమయంలో భారత్లో పర్యటించేందుకు నిరాకరించడంతో దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించడమే లక్ష్యంగా తమీమ్ అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాది చివర్లో ద్వైపాక్షిక సిరీస్ కోసం టీమిండియాను బంగ్లాదేశ్కు ఆహ్వానిస్తూ బీసీసీఐకి అధికారిక ప్రతిపాదనలు పంపారు. భారత్లో పర్యటించేందుకు కూడా బంగ్లా ఆసక్తి చూపుతోంది.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) సైకిల్లో భాగంగా భారత్ పర్యటనను విజయవంతం చేయడం ద్వారా రెండు దేశాల మధ్య క్రికెట్ బంధాన్ని మళ్లీ బలోపేతం చేయాలని తమీమ్ భావిస్తున్నారు.