Hormuz Strait: హర్మూజ్ను తెరిచేందుకు బ్రిటన్ ప్రయత్నాలు... భారత్ సహా 40 దేశాలకు ఆహ్వానం
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా మారిన హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి సుమారు 40 దేశాలతో చర్చిస్తున్నట్లు బ్రిటన్ వెల్లడించింది. ఈ జలసంధిని తెరవడానికి బ్రిటన్ నేతృత్వంలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం ఆ దేశం పలు దేశాలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం 40 దేశాలను ఆహ్వానించింది.
ఈ జాబితాలో భారత్ కూడా ఉంది. భారత్ తరఫున విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఇందులో వర్చువల్గా పాల్గొంటారని తెలుస్తోంది. ఈ సమావేశంలో అమెరికా పాల్గొనడం లేదు.
హర్మూజ్ జలసంధిని తెరవడానికి ప్రపంచ దేశాలు ప్రయత్నించాలని ట్రంప్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రిటన్ స్పందించింది.
భారత్తో పాటు ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, యూఏఈ సహా 40 దేశాలు ఈ వర్చువల్ సమావేశంలో పాల్గొననున్నాయి. వచ్చే వారం ఈ సమావేశం ఉండనుంది. ఈ సమావేశానికి బ్రిటన్ విదేశాంగ మంత్రి కూపర్ అధ్యక్షత వహించనున్నారు. ఇరాన్ వైఖరి ప్రపంచ ఆర్థిక భద్రతను దెబ్బతీస్తోందని కూపర్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ జాబితాలో భారత్ కూడా ఉంది. భారత్ తరఫున విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఇందులో వర్చువల్గా పాల్గొంటారని తెలుస్తోంది. ఈ సమావేశంలో అమెరికా పాల్గొనడం లేదు.
హర్మూజ్ జలసంధిని తెరవడానికి ప్రపంచ దేశాలు ప్రయత్నించాలని ట్రంప్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రిటన్ స్పందించింది.
భారత్తో పాటు ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, యూఏఈ సహా 40 దేశాలు ఈ వర్చువల్ సమావేశంలో పాల్గొననున్నాయి. వచ్చే వారం ఈ సమావేశం ఉండనుంది. ఈ సమావేశానికి బ్రిటన్ విదేశాంగ మంత్రి కూపర్ అధ్యక్షత వహించనున్నారు. ఇరాన్ వైఖరి ప్రపంచ ఆర్థిక భద్రతను దెబ్బతీస్తోందని కూపర్ ఆందోళన వ్యక్తం చేశారు.