Kasu Mahesh Reddy: పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ క్రెడిట్ కొట్టేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది: కాసు మహేశ్
పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ మెడికల్ కాలేజీ పనులు 60 శాతం వరకు పూర్తయ్యాయని, జగన్ చొరవతోనే పల్నాడుకు ఈ ప్రాజెక్టు వచ్చిందని ఆయన అన్నారు.
స్థానిక ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు ఈ కాలేజీపై కనీస అవగాహన లేదని, వైసీపీ తెచ్చిన ప్రాజెక్టును తమదేనని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఒకవేళ ఎమ్మెల్యేకి అంత చిత్తశుద్ధి ఉంటే, మిగిలిన పనులను త్వరగా పూర్తి చేసి చూపించాలని సవాల్ విసిరారు.