Ponguleti Srinivas Reddy: స్పీకర్ జడ్జిమెంట్‌ను ప్రశ్నించిన కేటీఆర్... తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Ponguleti Srinivas Reddy Criticizes KTR Over Speaker Judgment
షార్ట్స్‌లో చూడండి
స్పీకర్ జడ్జిమెంట్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించడం ఆయన అహంకారానికి నిదర్శనమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శాసనసభలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ టిక్కెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేశారని సభ దృష్టికి కేటీఆర్ తీసుకువచ్చారు. దీనిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పందిస్తూ, కేటీఆర్ జడ్జిమెంట్ కాపీని పూర్తిగా చదివి మాట్లాడాలని సూచించారు.

ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, సభాపతి జడ్జిమెంట్‌ను కేటీఆర్ ప్రశ్నించడం సరికాదని అన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది బీఆర్ఎస్ కాదా అని ప్రశ్నించారు. కేటీఆర్ కట్టుకథలు చెబుతున్నారని విమర్శించారు.

ప్రభుత్వంపై పదేపదే ఆరోపణలు చేసే బీఆర్ఎస్ పార్టీ వరుసగా నాలుగు ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయిందని నిలదీశారు. అసెంబ్లీ, పార్లమెంట్, గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వరుసగా ఓడిపోయారని అన్నారు. నిరంకుశానికి బ్రాండ్ అంబాసిడర్లు బీఆర్ఎస్ నాయకులు అని మంత్రి అన్నారు.
Go Back to Shorts
Ponguleti Srinivas Reddy
KTR
BRS
Telangana Congress
Speaker Gaddam Prasad Kumar
Telangana Politics

More Telugu News