గృహ ప్రవేశానికి హాజరై.. ఫొటో దిగుతూనే కుప్పకూలిన మహిళ
- ఖమ్మం జిల్లా త్రీటౌన్ ప్రాంతంలో విషాదం
- గృహ ప్రవేశ వేడుకకు హాజరైన 40 ఏళ్ల సుస్మిత
- ఆసుపత్రికి తరలించగా, మృతి చెందినట్లు ధృవీకరించిన వైద్యులు
వారికి శుభాకాంక్షలు చెప్పి, ఫొటో దిగుతుండగానే ఒక్కసారిగా వెనక్కి పడిపోయింది. పక్కన ఉన్న యువతి భుజంపై చేయి వేసి ఫొటో దిగుతుండగా ఈ ఘటన జరిగింది. పక్కనున్న వారు ఆమెను పట్టుకునే ప్రయత్నం చేశారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆమె కొన్ని రోజులుగా గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.