Chandrababu Naidu-Allu Sirish: తన ఇంటికి సీఎం చంద్రబాబు రావడం పట్ల అల్లు శిరీష్ ఆనందం... ఫొటోలు వైరల్!
టాలీవుడ్ యువ కథానాయకుడు, నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ ఇటీవల నయనికా రెడ్డిని వివాహం చేసుకుని ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. ఈ నూతన దంపతులను ఆశీర్వదించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వారి ఇంటికి వెళ్లారు. వధూవరులు శిరీష్, నయనికలను ఆశీర్వదించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ అనూహ్య పరిణామంపై అల్లు శిరీష్ సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు. చంద్రబాబుతో భేటీ తన జీవితంలో అత్యంత గుర్తుండిపోయే అనుభవమని పేర్కొన్నారు. "ఇది నాకు దక్కిన గొప్ప గౌరవం. దశాబ్దాలుగా నేను ఆరాధించే నాయకుడు, మన ఏపీ సీఎం చంద్రబాబు గారు మా ఇంటికి వచ్చి నన్ను, నయనికను ఆశీర్వదించారు. ఆ దార్శనిక నేతతో గంటసేపు మాట్లాడటం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను" అని శిరీష్ తన పోస్ట్లో పేర్కొన్నారు.
ఇటీవల అల్లు శిరీష్, నయనికా రెడ్డిల వివాహం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన రిసెప్షన్కు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వారి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సందర్బంగా సీఎం చంద్రబాబుతో అల్లు అరవింద్ తదితరులు సమావేశమై కాసేపు ముచ్చటించారు. చంద్రబాబుతో శిరీష్ దంపతులు ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఈ అనూహ్య పరిణామంపై అల్లు శిరీష్ సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు. చంద్రబాబుతో భేటీ తన జీవితంలో అత్యంత గుర్తుండిపోయే అనుభవమని పేర్కొన్నారు. "ఇది నాకు దక్కిన గొప్ప గౌరవం. దశాబ్దాలుగా నేను ఆరాధించే నాయకుడు, మన ఏపీ సీఎం చంద్రబాబు గారు మా ఇంటికి వచ్చి నన్ను, నయనికను ఆశీర్వదించారు. ఆ దార్శనిక నేతతో గంటసేపు మాట్లాడటం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను" అని శిరీష్ తన పోస్ట్లో పేర్కొన్నారు.
ఇటీవల అల్లు శిరీష్, నయనికా రెడ్డిల వివాహం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన రిసెప్షన్కు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వారి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సందర్బంగా సీఎం చంద్రబాబుతో అల్లు అరవింద్ తదితరులు సమావేశమై కాసేపు ముచ్చటించారు. చంద్రబాబుతో శిరీష్ దంపతులు ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

