బళ్లారి పాఠశాలలో తోటి విద్యార్థులపై ఇనుప రాడ్డుతో దాడి.. కర్నూలు జిల్లా విద్యార్థి మృతి
- రాత్రి పడుకున్న సమయంలో దాడి చేసిన విద్యార్థి
- ఒకరి మృతి, ఏడుగురికి గాయాలు
- పరారీలో దాడి చేసిన విద్యార్థి
హాస్టల్లోని తోటి విద్యార్థులపై ఇనుప రాడ్డుతో దాడి చేశాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో మరణించిన విద్యార్థి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన బాలుడిగా గుర్తించారు. విషయం తెలియగానే జిల్లా పోలీసు అధికారి డాక్టర్ డి సుమన్ పెన్నేకర్ పాఠశాలను పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులతో మాట్లాడారు.