అవయవదాత చిన్నారికి అధికారిక లాంఛనాలతో వీడ్కోలు పలికిన కేరళ
- 10 నెలల చిన్నారి అలిన్ షెరిన్ అవయవాలతో ఐదుగురికి ప్రాణదానం
- పథనంతిట్ట జిల్లాలో జరిగిన అంత్యక్రియలకు కేంద్ర, రాష్ట్ర మంత్రుల హాజరు
- రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్కు గురైన చిన్నారి
- తల్లిదండ్రుల నిర్ణయంపై సీఎం పినరయి విజయన్, ప్రముఖుల ప్రశంసలు
కేరళలో అతి పిన్న వయస్కురాలైన అవయవదాత.. 10 నెలల చిన్నారి అలిన్ షెరిన్ అబ్రహంకు రాష్ట్రం కన్నీటి వీడ్కోలు పలికింది. ఐదుగురికి ప్రాణం పోసి తిరిగిరాని లోకాలకు వెళ్లిన ఆ చిన్నారికి ఆదివారం ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ హృదయ విదారక కార్యక్రమానికి వందలాది మంది హాజరై నివాళులర్పించారు.
పథనంతిట్ట జిల్లాలోని ఓ చర్చిలో జరిగిన అంత్యక్రియల సందర్భంగా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. కేంద్ర మంత్రి సురేశ్ గోపి, కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్, ఇతర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దుఃఖాన్ని దిగమింగుతూ తల్లిదండ్రులు అరుణ్ అబ్రహం, షెరిన్ ఆన్ జాన్ తీసుకున్న నిర్ణయం మానవత్వానికి నిలువుటద్దమని పలువురు కొనియాడారు.
ఫిబ్రవరి 5న జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో చిన్నారి అలిన్ తీవ్రంగా గాయపడింది. తల్లి, తాతయ్యలతో కలిసి ప్రయాణిస్తుండగా ఎదురుగా వచ్చిన కారు వారి వాహనాన్ని ఢీకొట్టింది. కొచ్చిలోని ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆమె ఫిబ్రవరి 12న బ్రెయిన్ డెడ్కు గురైనట్లు వైద్యులు ధ్రువీకరించారు. పుట్టెడు దుఃఖంలోనూ ఆ తల్లిదండ్రులు తమ చిన్నారి అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో అలిన్ కాలేయం, కిడ్నీలు, గుండె కవాటాలు, కళ్లను ఐదుగురికి అమర్చారు.
"మాటలకు అందని బాధలోనూ ఆ తల్లిదండ్రులు అవయవదానం చేసి కేరళ స్ఫూర్తిని చాటారు" అని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రశంసించారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు తాను నివాళులర్పించేందుకు వచ్చానని కేంద్ర మంత్రి సురేశ్ గోపి తెలిపారు. ఆ చిన్నారి శరీరం మట్టిలో కలిసినా, ఆమె అవయవాల రూపంలో ఇతరులలో జీవించే ఉంటుందని అన్నారు.
పథనంతిట్ట జిల్లాలోని ఓ చర్చిలో జరిగిన అంత్యక్రియల సందర్భంగా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. కేంద్ర మంత్రి సురేశ్ గోపి, కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్, ఇతర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దుఃఖాన్ని దిగమింగుతూ తల్లిదండ్రులు అరుణ్ అబ్రహం, షెరిన్ ఆన్ జాన్ తీసుకున్న నిర్ణయం మానవత్వానికి నిలువుటద్దమని పలువురు కొనియాడారు.
ఫిబ్రవరి 5న జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో చిన్నారి అలిన్ తీవ్రంగా గాయపడింది. తల్లి, తాతయ్యలతో కలిసి ప్రయాణిస్తుండగా ఎదురుగా వచ్చిన కారు వారి వాహనాన్ని ఢీకొట్టింది. కొచ్చిలోని ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆమె ఫిబ్రవరి 12న బ్రెయిన్ డెడ్కు గురైనట్లు వైద్యులు ధ్రువీకరించారు. పుట్టెడు దుఃఖంలోనూ ఆ తల్లిదండ్రులు తమ చిన్నారి అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో అలిన్ కాలేయం, కిడ్నీలు, గుండె కవాటాలు, కళ్లను ఐదుగురికి అమర్చారు.
"మాటలకు అందని బాధలోనూ ఆ తల్లిదండ్రులు అవయవదానం చేసి కేరళ స్ఫూర్తిని చాటారు" అని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రశంసించారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు తాను నివాళులర్పించేందుకు వచ్చానని కేంద్ర మంత్రి సురేశ్ గోపి తెలిపారు. ఆ చిన్నారి శరీరం మట్టిలో కలిసినా, ఆమె అవయవాల రూపంలో ఇతరులలో జీవించే ఉంటుందని అన్నారు.