Om Birla: లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన కాంగ్రెస్

Om Birla Faces No Confidence Motion from Congress
  • ఓం బిర్లాపై లోక్ సభ సెక్రటరీ జనరల్‌కు నోటీసు
  • రాజ్యాంగంలోని ఆర్టికల్ 94-సీ ప్రకారం ఈ నోటీసు ఇచ్చినట్లు వెల్లడి
  • ప్రతిపక్ష ఎంపీలను స్పీకర్ పదేపదే అడ్డుకున్నారని ఆరోపణ
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. ఓం బిర్లాను స్పీకర్ పదవి నుంచి తొలగించేలా తీర్మానం ప్రవేశపెట్టేందుకు లోక్ సభ సెక్రటరీ జనరల్‌కు ఈ నోటీసు ఇచ్చింది.

రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో మాట్లాడేందుకు విపక్ష నేత రాహుల్ గాంధీకి అవకాశం ఇవ్వకపోవడం, ఎనిమిది మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు వేయడం, కాంగ్రెస్ మహిళా ఎంపీలపై నిరాధార ఆరోపణలు చేసినప్పటికీ బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబేపై చర్యలు చేపట్టకపోవడం వంటి కారణాలతో విపక్షాలు అవిశ్వాస డిమాండ్‌ను తెరపైకి తెచ్చాయి.

అవిశ్వాస తీర్మానం కోసం నోటీసు ఇచ్చిన అనంతరం కాంగ్రెస్ నేత గౌరవ్ గొగొయ్ మాట్లాడుతూ, రాజ్యాంగంలోని ఆర్టికల్ 94-సీ ప్రకారం ఈ నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. దీనిపై కాంగ్రెస్, సమాజ్ వాది పార్టీ, డీఎంకేతో సహా పలు పార్టీలకు చెందిన 120 మంది ఎంపీలు సంతకాలు చేశారని అన్నారు. ప్రతిపక్ష ఎంపీలు ప్రజాప్రయోజన అంశాలు లేవనెత్తకుండా స్పీకర్ పదేపదే అడ్డుకోవడం తమను తీవ్రంగా బాధించిందని అన్నారు.

పలు సందర్భాలలో విపక్ష నేతలను మాట్లాడటానికి అనుమతించడం లేదని అన్నారు. అది వారి ప్రాథమిక హక్కు అని గుర్తు చేశారు. ఎనిమిది మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారని ఆరోపించారు. విపక్ష ఎంపీలు రాజ్యాంగపరమైన హక్కులను వినియోగించుకున్నందుకు శిక్షకు గురయ్యారని అన్నారు.
Om Birla
Lok Sabha Speaker
No Confidence Motion
Congress
Gaurav Gogoi
Rahul Gandhi
Indian Parliament

More Telugu News