తన బ్యాటింగ్ ప్రదర్శనపై వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు

  • యూఏఈపై 32 బంతుల్లోనే సెంచరీ చేసిన వైభవ్ సూర్యవంశీ
  • డబుల్ సెంచరీ కొట్టినా మా నాన్న సంతృప్తి చెందరన్న యువ క్రికెటర్
  • సెంచరీ చేసినా, డకౌట్ అయినా అమ్మ ఒకేలా చూస్తుందన్న వైభవ్
  • చిన్నప్పటి నుంచి నేర్చుకున్న ఆటకే కట్టుబడి ఉంటానని వెల్లడి
భారత యువ క్రికెట్ సంచలనం, 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో మరోసారి వార్తల్లో నిలిచాడు. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్‌లో ఇండియా-ఎ తరఫున యూఏఈపై ఆడుతూ కేవలం 32 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. మొత్తం 42 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 15 సిక్సర్లతో 144 పరుగులు చేసి ఔరా అనిపించాడు. ఈ నేపథ్యంలో తాజాగా బీసీసీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వైభవ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
 
తాను ఎంత బాగా ఆడినా, డబుల్ సెంచరీ చేసినా తన తండ్రి మాత్రం సంతృప్తి చెందరని వైభవ్ చెప్పుకొచ్చాడు. "నేను 200 పరుగులు చేసినా మా నాన్న తృప్తిగా ఉండరు. ఇంకో పది పరుగులు చేయాల్సింది అంటారు" అని తెలిపాడు. అయితే తన తల్లి మాత్రం దీనికి పూర్తి భిన్నమని, తాను సెంచరీ చేసినా, డకౌట్ అయినా ఆమె ఎప్పుడూ సంతోషంగానే ఉంటుందని చెప్పాడు.
 
తన బ్యాటింగ్ శైలి గురించి వివరిస్తూ, మైదానంలో అసాధారణ షాట్లు ప్రయత్నించనని, చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేసిన వాటికే కట్టుబడి ఉంటానని స్పష్టం చేశాడు. "నా ఆటలో భాగం కానిది కొత్తగా ప్రయత్నిస్తే అది జట్టుకు గానీ, వ్యక్తిగతంగా నాకు గానీ మేలు చేయదు" అని వివరించాడు. మరికొంత సమయం క్రీజులో ఉండి ఉంటే మరో 20-30 పరుగులు చేసి వ్యక్తిగత రికార్డును మరింత మెరుగుపరుచుకునేవాడినని అన్నాడు.

Vaibhav Suryavanshi
Vaibhav Suryavanshi batting
Asia Cup Rising Stars
India A cricket
UAE cricket
young cricketer
cricket century
BCCI interview
cricket records

More Telugu News