Mallikarjun Kharge: మల్లికార్జున ఖర్గేను పరామర్శించిన రేవంత్ రెడ్డి

Revanth Reddy Visits Mallikarjun Kharge
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను పరామర్శించారు. ఖర్గే అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రిలో చేరారు. బెంగళూరులోని ప్రఖ్యాత ఎం.ఎస్. రామయ్య ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందిన అనంతరం ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ఖర్గే శ్వాస సంబంధిత సమస్యలు, జ్వరంతో బాధపడుతున్న కారణంగా, ఆయన గుండె వేగం తగ్గకుండా ఉండేందుకు వైద్యులు పేస్ మేకర్ ఇంప్లాంట్ ప్రక్రియ నిర్వహించారు. 

ఈ నేపథ్యంలో మల్లికార్జున ఖర్గేను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెంగళూరుకు చేరుకున్నారు. పరామర్శ అనంతరం, వారి మధ్య రాజకీయ అంశాలపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, సుప్రీంకోర్టులో విచారణకు సంబంధించిన అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం.
Go Back to Shorts
Mallikarjun Kharge
Revanth Reddy
Congress
Telangana Politics
Jubilee Hills by-election
Local body elections

More Telugu News