Ambati Rambabu: స‌త్తెన‌ప‌ల్లి గ్రామీణ‌ పీఎస్‌లో విచార‌ణ‌కు హాజ‌రైన అంబ‌టి రాంబాబు, విడ‌ద‌ల ర‌జిని

Ambati Rambabu Vidadala Rajini Appear for Questioning in Sattenapalli
షార్ట్స్‌లో చూడండి
వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి అంబటి రాంబాబు స‌త్తెన‌ప‌ల్లి గ్రామీణ‌ పీఎస్‌లో విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు.  వైసీపీ అధినేత‌, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ గత నెల 18న పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సమయంలో అంబటి రాంబాబు నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులోనే తాజాగా ఆయ‌న విచార‌ణ‌కు హాజ‌రయ్యారు.

ఈ కేసులో మాజీ మంత్రి విడదల రజిని కూడా ఉన్నారు. దీంతో ఆమె కూడా తాజాగా స‌త్తెన‌ప‌ల్లి గ్రామీణ‌ పీఎస్‌లో విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా మొత్తం 113 మందిపై పోలీసులు కేసులు నమోదు చేయగా.. ఇప్పటికే పలువురిని విచారించారు. 
Go Back to Shorts
Ambati Rambabu
YSRCP
Vidadala Rajini
Sattenapalli
Rentapalla
Jagan Mohan Reddy
Palnadu district
Andhra Pradesh Politics
Police investigation

More Telugu News