Srisailam Project: శ్రీశైలం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద

Srisailam Project Inundated with Flood Water
--
మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణ ప్రాజెక్టుల్లోకి వరద పోటెత్తుతోంది. పైనుంచి వస్తున్న వరద నీటితో జూరాల డ్యామ్ ఇప్పటికే నిండుకుండలా మారింది. ఈ సీజన్ లో రెండోసారి అధికారులు డ్యామ్ గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. దీంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుకుంటోంది. శ్రీశైలం డ్యామ్ నెమ్మదిగా నిండుకుంటోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి 60,587 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోందని అధికారులు చెప్పారు.

అయితే, డ్యామ్ నుంచి ప్రస్తుతానికి నీటిని వదలడంలేదని తెలిపారు. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 854.20 అడుగులకు చేరింది. శ్రీశైలం జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 215.7080 టీఎంసీలు, ప్రస్తుతం 89.7132 టీఎంసీలకు చేరిందని అధికారులు వివరించారు. ప్రస్తుతం కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశామని చెప్పారు.
Srisailam Project
Srisailam reservoir
Telangana projects
Jurala Dam
Heavy Rains Maharashtra
Flood water
Water levels
Dam gates
Water release
Hydropower generation

More Telugu News