ఢిల్లీలో వారంలోనే వంద మందికి కొవిడ్ పాజిటివ్
- భారత్లో వెయ్యి దాటిన యాక్టివ్ కేసులు
- కేరళలో అత్యధికంగా 430 మందికి, మహారాష్ట్రలో 209 మందికి వైరస్
- కొవిడ్తో మహారాష్ట్రలో నలుగురు, కేరళలో ఇద్దరు, కర్ణాటకలో ఒకరు మృతి
రాష్ట్రాల వారీగా కేరళలో 430 మంది, మహారాష్ట్రలో 209 మంది, ఢిల్లీలో 104 మంది కొవిడ్ బాధితులు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గుజరాత్లో 83, కర్ణాటకలో 47, ఉత్తరప్రదేశ్లో 15, పశ్చిమ బెంగాల్లో 12 చొప్పున యాక్టివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది. కొవిడ్ కారణంగా మహారాష్ట్రలో నలుగురు, కేరళలో ఇద్దరు, కర్ణాటకలో ఒకరు మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. అయితే, అండమాన్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ వంటి రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం ఒక్క యాక్టివ్ కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి.