ఆలస్యంగా మొదలైన పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్

Delayed Punjab Kings vs Delhi Capitals IPL Match
ఐపీఎల్ లో ఇవాళ పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. ధర్మశాలలో వర్షం పడడంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. సమయం ఉండడంతో, మ్యాచ్ ను పూర్తి ఓవర్ల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. 
 
ఇన్నింగ్స్ ఆరంభించిన పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ మొదటి నుంచే ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ముఖ్యంగా యువ బ్యాటర్ ప్రియాంశ్ ఆర్య తనదైన శైలిలో బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అతనికి ప్రభ్‌సిమ్రాన్ సింగ్ చక్కటి సహకారం అందించడంతో పంజాబ్ స్కోరు బోర్డు వేగంగా కదిలింది. పవర్ ప్లే (తొలి 6 ఓవర్లు) ముగిసే సమయానికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టపోకుండా 69 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది.

ఈ దశలో ప్రియాంశ్ ఆర్య కేవలం 22 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో 42 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరోవైపు ప్రభ్‌సిమ్రాన్ సింగ్ కూడా దూకుడుగా ఆడి 15 బంతుల్లో 4 ఫోర్లతో 26 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ రెండు ఓవర్లలో 23 పరుగులు, దుష్మంత చమీర రెండు ఓవర్లలో 27 పరుగులు సమర్పించుకున్నారు. కెప్టెన్ అక్షర్ పటేల్ ఒక ఓవర్ వేసి 15 పరుగులు ఇవ్వగా, టి నటరాజన్ ఒక ఓవర్లో 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దూకుడైన ఆరంభంతో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది.

కాగా, మ్యాచ్ ప్రారంభానికి ముందు గాయకుడు బి ప్రాక్ భారత సైనిక దళాలను కీర్తిస్తూ పలు గీతాలు ఆలపించాడు. ఈ ప్రదర్శనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.
Go Back to Shorts
Priyansh Arya
Prabhsimran Singh
Punjab Kings
Delhi Capitals
IPL 2024
Dharmashala
Cricket Match
B Praak
Indian Army
T Natarajan

More Telugu News