Chandrababu Naidu: ఇవాళ రాత్రికి ఢిల్లీ చేరుకోనున్న సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Arrives in Delhi Tonight

  • యూరప్ పర్యటన నుంచి నేరుగా హస్తిన రాక
  • రేపు ఢిల్లీలో పర్యటించనున్న చంద్రబాబు
  • కేంద్ర మంత్రులతో భేటీ కానున్న సీఎం
  • ఏపీకి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చ

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. తన పుట్టిన రోజు వేడుకల కోసం కుటుంబ సభ్యులతో కలిసి యూరప్ వెళ్లిన చంద్రబాబు ఇవాళ రాత్రికి హస్తిన చేరుకోనున్నారు. చంద్రబాబు రేపు (ఏప్రిల్ 22) ఉదయం 10.30 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో సమావేశం కానున్నారు. అనంతరం 11.30 గంటలకు కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తో భేటీ అవుతారు. మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నారు. 

ఏపీకి సంబంధించిన పెండింగ్ అంశాలు, ఇతర అభివృద్ధి పనులపై చర్చించనున్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన విషయాలపై కేంద్ర ప్రభుత్వ సహకారం కోరడమే ఈ భేటీల ముఖ్య ఉద్దేశ్యంగా తెలుస్తోంది.

Chandrababu Naidu
Delhi Visit
AP CM
Union Ministers
Amit Shah
CR Patil
Arjun Ram Meghwal
Andhra Pradesh
Central Government
Pending Issues
  • Loading...

More Telugu News