కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రక్షణ కవచం: కేటీఆర్
- రేవంత్ రెడ్డిని బీజేపీ కాపాడుతోందన్న కేటీఆర్
- సరైన సమయంలో బీజేపీలో చేరతానని రేవంత్ హామీ ఇచ్చినట్టుందని వ్యాఖ్యలు
- కేంద్రానికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా మౌనంగానే ఉంటోందని ఆగ్రహం
కాళేశ్వరం ప్రమాదంపై ఆగమేఘాలపై స్పందించిన కేంద్రం... మొన్నటి సుంకిశాల, నిన్నటి ఎస్ఎల్బీసీ ప్రమాదంపై ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు.
కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీ కాపాడుతోందనేది మిలియన్ డాలర్ వ్యవహారంలా మారిందని అన్నారు. సరైన సమయంలో బీజేపీలో చేరతానని రేవంత్ హామీ ఇచ్చినందునే... కేంద్రం ఆయనను కాపాడుతోందనే అనుమానం కలుగుతోందని కేటీఆర్ పేర్కొన్నారు.