270 కిలోల రాడ్డు మీదపడి మహిళా వెయిట్ లిఫ్టర్ మృతి

270 కిలోల రాడ్డు మీదపడి మహిళా వెయిట్ లిఫ్టర్ మృతి

Gold medallist powerlifter Yashtika Acharya dies in Bikaner gym after heavy weightlifting rod slips during training
  • జిమ్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా యష్తిక ఆచార్య మృతి
  • రాడ్డు మీద పడటంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు
  • అప్పటికే ప్రాణాలు విడిచినట్లు ధృవీకరించిన వైద్యులు
ప్రమాదవశాత్తు 270 కిలోల రాడ్డు మెడ మీద పడటంతో రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలో వెయిట్ లిఫ్టర్ యష్తిక ఆచార్య మృతి చెందింది. 17 ఏళ్ల ఆచార్య జిమ్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఆమె ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రాడ్డు మీద పడటంతో ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు.

హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ప్రాణాలు విడిచినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆచార్య గతంలో జూనియర్ నేషనల్ గేమ్స్‌లో స్వర్ణపతకాన్ని గెలుచుకుకుంది. ఈ ఘటనలో శిక్షకుడికి కూడా స్వల్పంగా గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.
Advertisement
Weight Lifter
wrestling
Rajasthan

More Telugu News