మహారాష్ట్ర అధికార కూటమిలో లుకలుకలు!
- సచివాలయంలో మెడికల్ సెల్ను ఏర్పాటు చేసిన షిండే
- సీఎంఆర్ఎఫ్ ఉన్నప్పటికీ ప్రత్యేకంగా దీనిని ఏర్పాటు చేయడంపై విమర్శలు
- 20 మంది ఎమ్మెల్యేలకు ‘వై’ సెక్యూరిటీ తొలగింపు
- వివాదానికి ఆజ్యం పోసిన నిర్ణయాలు
- తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవన్న ఫడ్నవీస్, షిండే
విభేదాల వార్తలపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా మాట్లాడారు. సచివాలయంలో మెడికల్ సెల్ను షిండే ఏర్పాటు చేయడంలో తప్పేమీ లేదన్నారు. తాను డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు కూడా అలాంటి దానినే ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
కాగా, ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఓ వైద్య సహాయ కేంద్రాన్ని షిండే ఏర్పాటు చేయడం వివాదాస్పదమైంది. అలాగే, అంతకుముందు 20 మంది ఎమ్మెల్యేలకు ‘వై’ సెక్యూరిటీ తొలగించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. వీరిలో బీజేపీ, ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ శివసేనకు చెందిన వారే ఎక్కువగా ఉండటం గమనార్హం. దీంతో మహాయుతి కూటమిలో ఏదో జరుగుతోందన్న వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో సీఎం, డిప్యూటీ సీఎం ఇలా స్పందించారు.