నేపాల్ను వణికించిన భారీ భూకంపం
- ఉదయం 6.35 గంటల ప్రాంతంలో భూకంపం
- రిక్టర్ స్కేలుపై 7.1గా తీవ్ర నమోదు
- భారత్లోని పలు రాష్ట్రాల్లోనూ భూ ప్రకంపనలు
- పొరుగునే ఉన్న చైనా, భూటాన్, బంగ్లాదేశ్పైనా ప్రభావం
నేపాల్లో సంభవించిన భూకంప ప్రభావం మన దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలపైనా పడింది. ఢిల్లీ-ఎన్సీఆర్, పశ్చిమ బెంగాల్, బీహార్ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. అలాగే, చైనా, భూటాన్, బంగ్లాదేశ్లోనూ భూమి ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. కాగా, 2015 ఏప్రిల్లో నేపాల్లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా దాదాపు 9 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.