ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ఎప్పటినుంచంటే..!
- వివరాలు వెల్లడించిన టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ
- కొత్త బస్సుల కొనుగోలుకు ఆర్టీసీ ప్రతిపాదనలు
- ఆటో డ్రైవర్లు నష్టపోకుండా విధివిధానాల రూపకల్పన
పథకం అమలు వల్ల బస్సుల్లో రద్దీ పెరిగే అవకాశం ఉండడంతో కొత్త బస్సులు కొనుగోలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించిందని చెప్పారు. ఇందుకోసం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపించారని, సీఎం వాటిని పరిశీలిస్తున్నారని తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణం కారణంగా ఆటో డ్రైవర్లు నష్టపోకూడదని ప్రభుత్వం భావిస్తోందని, దీనికి అనుగుణంగా పథకం విధివిధానాలు రూపొందిస్తున్నామని యార్లగడ్డ పేర్కొన్నారు.