టీ20 వరల్డ్ కప్: పాక్ ను కట్టడి చేసిన భారత్... రాణించిన తెలుగమ్మాయి అరుంధతి

Team India eves restricts Pakistan in T20 World Cup
  • దుబాయ్ లో భారత్ × పాకిస్థాన్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ అమ్మాయిలు
  • 20 ఓవర్లలో 8 వికెట్లకు 105 పరుగులు
  • 3 వికెట్లు తీసిన అరుంధతి రెడ్డి
యూఏఈలో జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్ లో నేడు చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. దుబాయ్ లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక.

టాస్ గెలిచిన పాక్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, భారత అమ్మాయిలు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి దాయాదిని సమర్థంగా కట్టడి చేశారు. దాంతో, పాక్ 20 ఓవర్లలో 8 వికెట్లకు కేవలం 105 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి కేవలం 19 పరుగులిచ్చి 3 వికెట్లు తీయడం విశేషం. అరుంధతి రెడ్డి పాక్ మహిళల జట్టు మిడిలార్డర్ ను దెబ్బతీసింది. టీమిండియా బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 2, రేణుకా సింగ్ 1, దీప్తి శర్మ 1, ఆశా శోభన 1 వికెట్ తీశారు. పాక్ జట్టులో నిదా దార్ చేసిన 28 పరుగులే అత్యధికం. ఓపెనర్ మునీబా అలీ 17, కెప్టెన్ ఫాతిమా సనా 13, సయీదా అరూబ్ షా 14 పరుగులు చేశారు.
Advertisement
Team India
Pakistan
T20 World Cup
Dubai

More Telugu News