ఈ నెల 22న జనసేనలో చేరుతున్నా: సామినేని ఉదయభాను
- వైసీపీకి గుడ్ బై చెప్పిన సామినేని ఉదయభాను
- నేడు జనసేన కార్యాలయానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే
- వైసీపీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని వెల్లడి
వైసీపీలో తనకు ప్రాధాన్యత తగ్గిందని సామినేని అన్నారు. పార్టీ అధినాయకత్వం తీరు నచ్చకే రాజీనామా చేస్తున్నానని స్పష్టం చేశారు. కాగా, బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఆదివారం నాడే జనసేనలో చేరనున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరూ జనసేనాని పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు.