ఫైనల్లో పాకిస్థాన్పై ఘన విజయం.. లెజెండ్స్ ట్రోఫీ కూడా మనదే
- ఫైనల్లో పాకిస్థాన్ను మట్టికరిపించిన యువీ సేన
- అర్ధ సెంచరీతో అలరించిన అంబటి రాయుడు
- 5 వికెట్ల తేడాతో విజయం
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. జట్టులో షోయబ్ మాలిక్ ఒక్కడే భారత బౌలర్లను ఎదురొడ్డి 36 బంతుల్లో 3 సిక్సర్లతో 41 పరుగులు చేయగలిగాడు. మిగతా వారిలో ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. భారత బౌలర్లలో అనురీత్ సింగ్ 3 వికెట్లు తీసుకున్నాడు.
అనంతరం 157 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు మరో 5 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అంబటి రాయుడు 30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో అర్ధ సెంచరీ (50) సాధించాడు. గురుకీరత్సింగ్ మన్ 34, యూసుఫ్ పఠాన్ 30 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో ఆమీర్ యామిన్ రెండు వికెట్లు పడగొట్టాడు.