కువైట్ అగ్నిప్రమాదంలో మరణించిన ఏపీ కార్మికులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు

  • కువైట్ లోని ఓ అపార్ట్ మెంట్ లో అగ్నిప్రమాదం
  • 45 మంది భారతీయుల మృత్యువాత
  • అందులో ముగ్గురు ఏపీ కార్మికులు
  • తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు
కువైట్ లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 45 మంది భారతీయులు మృతి చెందిన సంగతి తెలిసిందే. వారి మృతదేహాలు ఇవాళ భారత్ చేరుకున్నాయి. మృతుల్లో ముగ్గురు ఏపీ వాసులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాల పరిస్థితి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

Kuwait Fire Accident
Exgratia
Chandrababu
Chief Minister
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News