గుంటూరు జిల్లాలో స్ట్రాంగ్ రూమ్ లు పరిశీలించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా

CEO Mukesh Kumar Meena visits strong room at Guntur Nagarjuna University
  • ఏపీలో జూన్ 4న కౌంటింగ్
  • ప్రశాంత వాతావరణంలో లెక్కింపు జరిగేలా ఏర్పాట్లు చేశామన్న మీనా
  • స్ట్రాంగ్ రూమ్ ల వద్ద మూడంచెల భద్రత ఉంటుందని వెల్లడి
  • ప్రస్తుతం పల్నాడులో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని వివరణ
ఏపీలో కౌంటింగ్  కు సమయం దగ్గరపడుతుండడంతో  రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా స్ట్రాంగ్ రూమ్ ల భద్రతను పరిశీలించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. 

ఇవాళ గుంటూరు జిల్లాలో నాగార్జున యూనివర్సిటీ వద్ద ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ లను ముఖేశ్ కుమార్ మీనా పరిశీలించారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్ వేణుగోపాల్  రెడ్డి, ఎస్పీ తుషార్ డూడీ కూడా ఉన్నారు. 

ఈ సందర్భంగా సీఈవో ముఖేశ్ కుమార్ మీనా మాట్లాడుతూ, కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని వెల్లడించారు. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని... అభ్యర్థులు, ఏజెంట్లు రెండుసార్లు పరిశీలించే అవకాశం కల్పించామని వివరించారు. 

అల్లర్ల దృష్ట్యా రాష్ట్రానికి 20 కంపెనీల కేంద్ర బలగాలను కేటాయించామని, కౌంటింగ్ రోజు, ఆ తర్వాత ఘర్షణలు జరగకుండా పటిష్ఠ భద్రత ఏర్పాటు చేస్తున్నామని మీనా వివరించారు. ప్రస్తుతం పల్నాడులో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని తెలిపారు.
Go Back to Shorts
Mukesh Kumar Meena
Strong Rooms
EVM
Counting
Andhra Pradesh

More Telugu News