విజయవాడ లోక్సభ పరిధిలో అన్ని స్థానాలూ కూటమికే: కేశినేని చిన్ని
- వైసీపీ ప్రభుత్వంపై కోపంతో ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు వచ్చారన్న చిన్ని
- ఓటమి భయంతో వైసీపీ దాడులకు తెగబడిందని విమర్శ
- కూటమి ఘన విజయం సాధించబోతోందని ధీమా
మరోవైపు విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని తాజాగా మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ ప్రభుత్వంపై కసి, కోపం, బాధతో ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు వచ్చారని చెప్పారు. ఎన్నికల్లో ఓటమి తప్పదనే విషయాన్ని గ్రహించిన వైసీపీ నేతలు దాడులకు తెగబడ్డారని అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయంతో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో కూటమి విజయం సాధిస్తుందని చెప్పారు.