పాట్నాలో భారీ అగ్ని ప్రమాదం..ఆరుగురి మృతి
- మరో 30 మందికి పైగా గాయాలు
- గ్యాస్ సిలిండర్ పేలుడు వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నిర్థారణకు వచ్చిన పోలీసులు
- క్షతగాత్రులను చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించిన పోలీసులు
- బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్న సీఎం నితీష్ కుమార్
అగ్ని ప్రమాద సమాచారాన్ని అందుకున్న అగ్నిమాపక శాఖ వెంటనే సిబ్బందితో అక్కడకు చేరుకుని సుమారు రెండుగంటలపాటు శ్రమించి మంటల్ని అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రమాదంలో మరణించిన వారి వివరాలు ఇంకా తెలియరాలేదు. గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్థారిస్తున్నారు. కాగా, అగ్ని ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.