Stock Market: అంతర్జాతీయ సానుకూలతలు.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Markets ends in profits
  • 560 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 189 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 2.67 శాతం లాభపడ్డ ఎల్ అండ్ టీ షేరు విలువ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతలతో పాటు, మన సూచీలు కూడా రాణించడంలో మార్కెట్లు లాభాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 560 పాయింట్లు లాభపడి 73,649కి చేరుకుంది. నిఫ్టీ 189 పాయింట్లు పెరిగి 22,336 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎల్ అండ్ టీ (2.67%), యాక్సిస్ బ్యాంక్ (2.38%), బజాజ్ ఫైనాన్స్ (2.36%), అల్ట్రాటెక్ సిమెంట్ (2.09%), విప్రో (2.01%). 

టాప్ లూజర్స్:
ఎన్టీపీసీ (-2.24%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.24%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-1.17%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.46%), టాటా స్టీల్ (-0.15%). 

  • Loading...

More Telugu News