తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థాన వేడుకలు
- నేడు శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది
- తిరుమల ఆలయంలో బంగారు వాకిలి వద్ద పంచాంగ శ్రవణం
- శ్రీవారి ఆలయ ముస్తాబు కోసం 10 టన్నుల పుష్పాల వినియోగం
ఉగాది పర్వదినం నేపథ్యంలో శ్రీవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఇందుకోసం 10 టన్నుల పుష్పాలను వినియోగించారు.
నేటి వేకువ జామున 3 గంటలకు సుప్రభాత సేవ నిర్వహించారు. ఉదయం 6 గంటలకు ఉభయ దేవేరులతో కూడిన మలయప్పస్వామి వారికి, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ జరిపారు. అనంతరం విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపు నిర్వహించి ఆలయంలోకి ప్రవేశించారు. స్వామివారి మూల విరాట్, ఉత్సవమూర్తులను నూతన వస్త్రాలతో అలంకరింపజేశారు.





