ముంబైతో ఎలిమినేటర్ మ్యాచ్.. డబ్ల్యూపీఎల్ లో బెంగళూరు నిజంగా మ్యాజిక్ చేసిందిగా..!
- డబ్ల్యూపీఎల్ ఫైనల్ చేరిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్
- ఎలిమినేటర్ మ్యాచ్లో ఓటమితో ఇంటిదారి పట్టిన ముంబై ఇండియన్స్
- ఆదివారం టైటిల్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనున్న స్మృతి మంధాన సేన
నిలకడగా ఆడుతూ విజయం దిశగా సాగుతున్న ముంబై ఆ తర్వాత వరుస ఓవర్లలో వికెట్లు పారేసుకుంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ (33), సజన (01) వెంటవెంటనే పెవిలియన్ చేరడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఈ క్రమంలో ముంబై విజయానికి చివరి ఓవర్లో 12 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్ ఆశకు ఇచ్చింది కెప్టెన్ స్మృతి మంధాన. అప్పటికే బాగా ఆడుతున్న అమేలియా క్రీజులో ఉండడంతో ముంబై విజయంపై ధీమాగానే ఉంది. కానీ, ముంబై బ్యాటర్లను ఆశ కట్టడి చేసింది. తొలి మూడు బంతులకు 4 పరుగులు మాత్రమే ఇచ్చింది. ఆ తర్వాత నాలుగో బంతికి పూజ (04) ను పెవిలియన్ పంపించింది. దీంతో సమీకరణం 2 బంతుల్లో 8 పరుగులకు మారింది. ఆ తర్వాతి రెండు బంతులకు కేవలం 2 పరుగులు ఇచ్చి బెంగళూరును 5 పరుగుల తేడాతో గెలిపించింది. ఇలా స్మృతి మంధాన సేన చివరి వరకు పోరాడి అద్భుత విజయాన్ని సాధించి ఫైనల్కు దూసుకెళ్లింది. దీంతో ఆదివారం టైటిల్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది.