రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం... మాజీలకు గన్‌మన్ల తొలగింపు

Revanth Reddy government another key decision
  • మాజీ మంత్రులతో పాటు మాజీ ఎమ్మెల్యేలకూ గన్ మన్ల తొలగింపు 
  • ఎవరికి గన్‌మన్లు అవసరమనే దానిపై సమీక్షించనున్న ఇంటెలిజెన్స్ అధికారులు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం భద్రతను తొలగించింది. వారికి గన్‌మన్లను తొలగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గన్‌మన్లను పోలీస్ శాఖ ఉపసంహరించుకుంటోంది. ఎవరికి గన్‌మన్లు అవసరమనే దానిపై ఇంటెలిజెన్స్ అధికారులు సమీక్షించనున్నారు. ఆ తర్వాతే మాజీలకు గన్‌మన్లను కేటాయిస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలపై దృష్టి సారించింది. ఇప్పుడు మాజీ మంత్రుల సెక్యూరిటీని తొలగించింది.
Advertisement
Revanth Reddy
Congress

More Telugu News