Advertisement

అమరావతి అసైన్డ్ భూముల కేసు.. విచారణ వాయిదా వేసిన హైకోర్టు

AP High Court adjourned Assigned lands case
  • కేసులో మరికొందరిని నిందితులుగా చేర్చామన్న సీఐడీ
  • కేసును రీఓపెన్ చేయాలని హైకోర్టుకు విన్నపం
  • తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసిన హైకోర్టు
అమరావతి అసైన్డ్ భూముల అంశంపై ఏపీ హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ వేసిన క్వాష్ పిటిషన్లపై ఇప్పటికే విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈనాటి విచారణ సందర్భంగా... ఈ కేసులో మరికొందరిని నిందితులుగా చేర్చామని హైకోర్టుకు సీఐడీ తెలిపింది. కేసును రీఓపెన్ చేయాలని కోర్టును కోరింది. కేసును రీఓపెన్ చేయడంపై హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
Advertisement
Assigned Lands Case
Chandrababu
Telugudesam
AP High Court

More Telugu News