Chandrababu: ఢిల్లీ చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు

Chandrababu arrives Delhi to attend Siddharth Luthra son wedding reception

  • ఈ సాయంత్రం న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా తనయుడి పెళ్లి రిసెప్షన్ 
  • హాజరు కానున్న చంద్రబాబు
  • రేపు సాయంత్రం హైదరాబాద్ కు తిరుగు పయనం

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లారు. ఈ సాయంత్రం తన న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్ కు చంద్రబాబు హాజరుకానున్నారు. రేపు సాయంత్రం చంద్రబాబు తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. కాగా, ఢిల్లీ ఎయిర్ పోర్టులో చంద్రబాబుకు టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు.

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సెప్టెంబరు 9న చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాలతో ఏపీ హైకోర్టు మొదట మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అక్టోబరు 31న చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. 

హైదరాబాదులో కంటికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నారు. శస్త్రచికిత్స అనంతరం చంద్రబాబు బయటికి రావడం ఇదే ప్రథమం. కాగా, చంద్రబాబు ఈ నెల 30న తిరుమల వెళ్లనున్నారు. డిసెంబరు 1వ తేదీ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు.

Chandrababu
New Delhi
Siddharth Luthra
Son
Wedding Reception
TDP
Andhra Pradesh
  • Loading...

More Telugu News