ఈ ధరలు, ఈ పాలనతో బతికే పరిస్థితి లేదు: రేవంత్ రెడ్డి
- డంపింగ్ యార్డు అంశంపై కోర్టుకు వెళ్లి ఆదేశాలు తెచ్చినా తరలించలేదని విమర్శలు
- తెలంగాణలో పేదల పరిస్థితి దారుణంగా ఉందన్న రేవంత్ రెడ్డి
- కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అందరినీ ఆదుకుంటామని వెల్లడి
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదలను ఆదుకుంటామన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల రూ.2500 అందిస్తామన్నారు. రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో రూ.400గా ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు రూ.1200కు చేరుకుందన్నారు. తాము అధికారంలోకి రాగానే ఉపాధి హామీ పనికి వెళ్లే ప్రతి ఒక్కరికి రూ.12వేలు అందిస్తామన్నారు.