శ్రీకాళహస్తి ఆలయ దర్శన వేళల్లో మార్పులు
శ్రీకాళహస్తిలో కొలువైన ముక్కంటి ఆలయంలో దర్శన వేళల్లో మార్పు చేశారు. కార్తీక మాసం సందర్భంగా శ్రీకాళహస్తిలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రేపటి నుంచి నెల రోజుల పాటు కోటి కుంకుమ బిల్వార్చన, తదితర పూజలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 4 గంటలకు ఆలయం తెరవనున్నారు. ఉదయం 5 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం కల్పించనున్నారు. రాత్రి 9 గంటల వరకు భక్తులకు దర్శనానికి అనుమతి ఉంటుందని ఆలయ ఈవో వెల్లడించారు.