పాకిస్థాన్ రక్తసిక్తం.. ఆత్మాహుతి దాడిలో 50 మందికిపైగా మృతి
- బలూచిస్థాన్ ప్రావిన్సులోని మస్తుంగ్ జిల్లాలో ఘటన
- మహ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకుని భక్తులు ర్యాలీకి సిద్ధమవుతుండగా దాడి
- ఈ నెలలో ఇక్కడ జరిగిన రెండో అతిపెద్ద ఘటన ఇదే
- తమకు సంబంధం లేదన్న పాకిస్థాన్ తాలిబన్ సంస్థ
ఈ ఆత్మాహుతి దాడికి ఇప్పటి వరకు ఎవరూ బాధ్యత ప్రకటించలేదు. ఈ పేలుడుతో తమకు సంబంధం లేదని ‘ది పాకిస్థాన్ తాలిబన్’ (టీటీపీ) స్పష్టం చేసింది. ముస్తుంగ్లో ఈ నెలలో జరిగిన రెండో అతిపెద్ద పేలుడు ఇదేనని అధికారులు తెలిపారు. ఇటీవల జరిగిన పేలుడులో జామియత్ ఉలేమా-ఇ-ఇస్లామ్ ఫజల్ నేత హఫీజ్ హమ్దుల్లా సహా పలువురు గాయపడ్డారు.