గిరిజనుడిపై మూత్ర విసర్జన.. భారీ మూల్యం చెల్లించుకున్న నిందితుడు
- గిరిజనుడిపై మూత్ర విసర్జన చేసిన పర్వేశ్ శుక్లా ఇంటిని కూల్చేసిన మధ్యప్రదేశ్ అధికారులు
- ఇల్లు కూలిపోవడం చూసి హతాశులైన నిందితుడి కుటుంబసభ్యులు
- తమ కుమారుడిపై కుట్ర పన్నారని నిందితుడి తండ్రి వ్యాఖ్య
- ఎన్నికలు సమీపిస్తున్నందున పాత వీడియోను బయటకు లాగారని కుటుంబసభ్యుల ఆరోపణ
మరోవైపు, ఇల్లు కూలిపోవడం చూసి పర్వేశ్ కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. తమ కుమారుడి నేరానికి సాక్ష్యంగా పోలీసులు ప్రస్తావిస్తున్న వీడియో చాలా పాతదని చెప్పారు. ఎన్నికలు సమీపించడంతో రాజకీయ కారణాలతో దీన్ని బయటకు లాగారని ఆరోపించారు. అంతకుమునుపు, పర్వేశ్ శుక్లా తండ్రి కూడా ఈ వివాదంపై స్పందించారు. ‘‘నా కుమారుడు ఇలాంటి పనిచేసేందుకు ఛాన్సే లేదు. అతడిపై ఏదో కుట్ర జరుగుతోంది. వీడియో చూసి మేము చాలా ఒత్తిడికి లోనయ్యాం’’ అని అన్నారు.