Telangana: ఇంటిముందు చెత్త వేసినందుకు మహిళపై హైకోర్టు అడ్వొకేట్ దాడి

High court advocate attacks woman over littering infront of his house
షార్ట్స్‌లో చూడండి
ఇంటి ముందు చెత్త వేసిన మహిళపై హైకోర్టు అడ్వొకేట్ దాడికి తెగబడ్డాడు. మలక్‌పేటలో తాజాగా ఈ ఘటన వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే, మూసారాంబాగ్‌లోని సాయి నగర్ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో ఆంటోని రెడ్డి అలియాస్ క్రాంతి రెడ్డి నివాసముంటున్నాడు. తాజాగా అతడు తన ఇంటి ముందు చెత్తవేశారంటూ ఓ మహిళ, యువకుడిపై దాడికి దిగాడు. ఇంట్లో ఉన్న మహిళను చేతులుపట్టి బయటకు లాక్కొచ్చాడు. అతడిని అడ్డుకున్న వారిపై కూడా దాడికి దిగాడు. వారిపై పిడిగుద్దులు కురిపించాడు. 

ఈ క్రమంలో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అడ్వొకేట్ దాడిలో గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. తమ ముఖాలపై పిడిగుద్దులు కురిపించాడని బాధితులు ఈ సందర్భంగా వాపోయారు. కడుపులో తన్నాడని ఆరోపించారు.
Go Back to Shorts
Telangana
Hyderabad
High Court

More Telugu News