ప్రతిపక్షాలు లేకుండా చేయాలని చూస్తున్నారు: చినరాజప్ప
- వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయ్యే పరిస్థితి కనిపిస్తోందన్న చినరాజప్ప
- ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపణ
- జగన్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని వ్యాఖ్య
నారా లోకేశ్ పాదయాత్రకు ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తోందని చినరాజప్ప అన్నారు. జగన్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. జగన్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని... ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే దానికి నిదర్శనమని అన్నారు. సంక్షేమ పథకాలను కొంత మందికి ఇచ్చి, లక్షలాది మందికి ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.